మహాకుంభమేళ గురించి పురాణాల్లో ఏం చెప్పారు ?
మాఘమాసంలో గంగా స్నానం ప్రయార్టీ గురించి స్కంధపురాణంలో ఏం చెప్పారు ?
గరుడపురాణంలో కుంభమేళ ప్రాధాన్యత వివరణేంటీ ?
కుంభమేళకు ప్రయాగరాజ్ ముస్తాబైంది. పురాణాల్లో కుంభమేళ గురించి గొప్పగా వర్ణించారు. ఏ పురాణంలో ఏం చెప్పారో ఒక్కసారి చూద్దాం.
“పృథివ్యాం కుంభయోగస్య చతుర్ధా భేద ఉచ్చతే.
చతు:స్థలే నితనాత్ సుధా కుంభస్థ భూతలే..
చంద్ర ప్రస్రవణ రక్షణ సూర్యోం విస్ఫోటనాత్ దధౌ ।
దైత్యేభ్యశ్చ గురు రక్షం సౌరిదేవేంద్రజాత్ భయత్..”
_ పద్మపురాణం
పద్మాపురాణంలో చెప్పబడిన ఈ శ్లోకం అర్ధమేంటి అంటే భూమిపై నాలుగు రకాల కుంభ యోగాలు ఉన్నాయని అర్ధం. సూర్యంచంద్రుల ద్వారా ఇక్కడ అమృతం ప్రవహిస్తోంది.
“మాఘే మాసే గంగే స్నానం యః కురుతే నరః. యుగకోటిసహస్రాణి తిష్ఠంతి పితృదేవతాః..”
__ స్కంధ పురాణం
స్కంద పురాణంలో చెప్పిన ఈ శ్లోకభావమేంటి అంటే మాఘమాసంలో గంగాస్నానం చేసిన వ్యక్తి పూర్వీకులు స్వర్గంలో ఉంటారు.
“త్రిషు స్థలేషు యః స్నాయాత్ ప్రయాగే చ పుష్కరే. కురుక్షేత్రే చ ధర్మాత్మా స యాతి పరమం పదం..” పద్మ పురాణంలో పేర్కొన్న ఈ శ్లోకం అర్ధమేంటీ అంటే ప్రయాగ, పుష్కర్ మరియు కురుక్షేత్రాలలో స్నానం చేసిన సదాచార్యుడు సర్వోన్నత నివాసానికి వెళ్తాడు.
“అగ్నిష్టోమసహస్రాణి వాజపేయశతాని చ.
కుంభస్నానస్య కలాం నార్హంతే షోడశీమపి।।
_గరుడ పురాణం
గరుడపురాణంలో చెప్పిన ఈ శ్లోకం అర్ధమేంటి అంటే వేలాది అగ్నిస్తోమాలు మరియు వందలాది వాజపేయి త్యాగాలు కూడా కుంభ స్నానంలో పదహారవ వంతుకు సమానం కాదు.
“ప్రయాగే మాఘమాసే తు స్నాత్వా పార్థీవమర్
సర్వపాపైః ప్రముచ్యేత్ పితృభిః సః మోదతే ।।.”
_బ్రహ్మ వైవర్త పురాణం
బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పిన ఈ శ్లోకం అర్ధమేంటీ అంటే మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేయడం వల్ల సర్వ పాపాల నుంచి విముక్తి పొంది, పూర్వీకులు ప్రసన్నులవుతారు.
“కుంభే కుంభోద్భవః స్నాత్వా ప్రాయచ్ఛతి హి మానవాన్. తతః పరం న పాపాని తిష్ఠంతి శుభకర్మణామ్।।”
అగ్ని పురాణం ప్రకారం చెప్పిన ఈశ్లోకర్ధమేంటీ అంటే కుంభరాశిలో స్నానం చేయడం వల్ల పాపాల నుంచి విముక్తి లభించి పుణ్యం లభిస్తుంది.
“అయం కుంభః పరం పుణ్యం స్నానం యేన కృతం శుభం. సర్వపాపక్షం యాతి గచ్ఛతే విష్ణుసన్నిధిం..”
విష్ణు పురాణంలో చెప్పిన ఈ శ్లోకం భావమేంటీ అంటే కుంభస్నానం అత్యంత పుణ్యప్రదమైనది మరియు విష్ణులోకానికి వెళుతుంది.
“తత్రాపి యః స్నానకృత్ పుణ్యకాలే. గంగా జలం తీర్థమథాధివాసం. పుణ్యం లభేత్ కృతకృత్యః స గత్వా । వైకుంఠలోకం పరమం సమేతి..”
శ్రీమద్ భగవత్ పురాణంలో చెప్పిన ఈ శ్లోకం భావమేంటీ అంటే పుణ్యకాలంలో గంగాస్నానం చేసిన వ్యక్తి పుణ్యం పొంది వైకుంఠ ధామానికి వెళ్తాడు.