• About
  • Advertise
  • Careers
  • Contact
Monday, May 19, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
Fact News
  • Home
  • నేటి వాస్తవాలు
  • వీడియోలు
  • Home
  • నేటి వాస్తవాలు
  • వీడియోలు
No Result
View All Result
Fact News
No Result
View All Result
Home నేటి వాస్తవాలు

Treaty Politics in Telangana

by Fact News Team
January 16, 2025
in నేటి వాస్తవాలు
0
0
SHARES
14
VIEWS
Share on FacebookShare on Twitter


తెలంగాణలో సంధి రాజకీయాలు !

తెలంగాణలో పాలక, ప్రతిపక్షాల మధ్య సంధి కుదుర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా ?
కొన్ని అంశాల్లోనైనా పాలక, ప్రతిపక్షాలు కలిసిపోవాలన్న విద్యాసాగర్ రావు మాటల వెనక మర్మమేంటీ ?
రేవంత్​ ముందు ఆ ప్రస్తావన ఎందుకు పెట్టారు ? ఎవరి కోసం ఆయన అలా మాట్లాడారు ?
అసలు విద్యాసాగర్​ రావు ఏమన్నారు ? ఆయన మాటల వెనక మర్మమేంటీ ?

తెలంగాణలో పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి… బీఆర్​ఎస్​ పై సందర్భం వచ్చిన ప్రతీసందర్భంలో భగ్గుమంటున్నారు. కానీ అదే రేవంత్​ ముందు.. పాలక, ప్రతిపక్షాలు కొన్ని సందర్భాల్లోనైనా కలిసి వెళ్లాలని మాజీ గవర్నర్​ విద్యాసాగర్​ రావు హితవు చెప్పడంలో వెనక ఆంతర్యమేంటోనని పలువురు చర్చించుకుంటున్నారు. బీజేపీ నేత, మాజీ గవర్నర్​ చెన్నమనేని విద్యాసాగర్​ రావు స్వీయ చరిత్ర పుస్తకావిష్కరణ సభకు సీఎం రేవంత్​ రెడ్డి హాజరయ్యారు. వేదికపై రేవంత్​ రెడ్డి… విద్యార్థి పరిషత్​ తో ఉన్న అనుబంధాన్ని సైతం గుర్తు చేసుకున్నారు.
విద్యాసాగర్​ రావు… కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టిన కాషాయవాది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. క్లిష్ట పరిస్థితుల్లో మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్​ గా సేవలు అందించారు. ప్లీడర్​ నుంచి గవర్నర్​ దాకా ఏ పని చేసినా…విద్యాసాగర్​ రావు సక్సెస్​ ఫుల్​ గా బాధ్యతలను నిర్వర్తించారు. గోదావరి జలాల వినియోగం, సెప్టెంబర్​ 17 అంశాల పేరు వింటేనే విద్యాసాగర్​ రావు పేరు గుర్తుకు వస్తాయి.
ఉనిక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విద్యాసాగర్​ రావు మాటలకు అర్ధామేంటో అని కమలనాథులు చర్చించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మాణ సమయంలో మహారాష్ట్ర గవర్నర్​ గా విద్యాసాగర్​ రావు పూర్తి స్థాయిలో అప్పటి సీఎం కేసీఆర్​ కు సహకరించారు. ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్​ పై విచారణ కొనసాగుతోంది. ఈ కార్​ రేసు కేసును ఈడీ, ఏసీబీ దర్యాప్తు చేస్తున్నాయి. పాలక, ప్రతిపక్షాలు ప్రతీ అంశంలోనూ మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంలో విద్యాసాగర్​ రావు… అధికార, ప్రతిపక్షాలు కలిసిపోవాలని ఏ ఉద్దేశ్యంతో అన్నారనే చర్చ సాగుతోంది. ఎన్టీఆర్​ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన సమరసింహారెడ్డి పెట్టిన ప్రైవేటు బిల్లును సభ ఆమోదించిన విషయాన్ని విద్యాసాగర్​ రావు గుర్తు చేశారు.
హైడ్రా పనితీరును ప్రశంసించడం… మూసీ సుందరీకరణ చేయాల్సిందేనని విద్యాసాగర్​ రావు మాటలను బీజేపీ అధిష్టానం ఎలా చూస్తుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్​ మారింది. మొత్తంగా తెలగాణ బీజేపీలో విద్యాసాగర్​ రావు మాటలు మాత్రం హాట్​ టాపిక్​ గా మారాయి.

……………………………………………. Fact News team

Tags: BJPCONGRESSFactNewsMIMTELANGANA POLITICAL EQUATIONSTreaty Politics in Telangana
Fact News Team

Fact News Team

Next Post

TBJP Untouchability

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended

కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి సేవలో సీఎం చంద్రబాబు AndhraPradesh  Chandrababu Naidu @factnews7447

పెట్టుబడులపై పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​గౌడ్​ #telangana pcc maheshkumargoud @factnews7447

4 months ago
పేదలకు ఉచిత వైద్యం దూరమైంది : విడుదల రజని #vidadalarajani @factnews7447 #ysrcp #ysjagan #naralokesh

పేదలకు ఉచిత వైద్యం దూరమైంది : విడుదల రజని #vidadalarajani @factnews7447 #ysrcp #ysjagan #naralokesh

4 months ago

Popular News

    Connect with us

    Newsletter

    Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
    SUBSCRIBE

    Category

    • నేటి వాస్తవాలు
    • వీడియోలు

    Site Links

    • Log in
    • Entries feed
    • Comments feed
    • WordPress.org

    About Us

    We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

    • About
    • Advertise
    • Careers
    • Contact

    © 2025

    No Result
    View All Result
    • Home

    © 2025

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In